ముంబై, మే 8: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికపు ఏకీకృత నికర లాభంలో 6 శాతం వృద్ధి నమోదు చేసుకున్నది. జనవరి- మార్చి మధ్యకాలానికిగాను బ్యాంక్ రూ.19,684 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదేకాలానికి గాను బ్యాంక్ రూ.18,643 కోట్లుగా నమోదైంది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.1,43,876 కోట్ల నుంచి రూ.1,40,412 కోట్లకు పడిపోయినట్లు వెల్లడించింది.
కుప్పకూలిన బ్యాంక్ షేరు
నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో ఎస్బీఐ బ్యాంక్ షేరు కుప్పకూలింది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి బ్యాంక్ షేరు 6.62 శాతం వరకు నష్టపోయి రూ.1,019.55 వద్ద స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈలోనూ 6.65 శాతం దిగొచ్చి రూ.1,019.30 వద్ద నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.66,691.20 కోట్లు కరిగిపోయి రూ.9,41,107.62 కోట్లకు జారుకున్నది.
– సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్