న్యూఢిల్లీ, డిసెంబర్ 31: బ్యాంకింగ్, బీమా దిగ్గజాలైన ఎస్బీఐ, ఎల్ఐసీలకు త్వరలో కొత్త బాస్లు రాబోతున్నారు. వీరితోపాటు నూతన సంవత్సరం తొలి త్రైమాసికం(జనవరి-మార్చి మధ్యకాలం)లో కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు నూతన బాస్లను నియమించడానికి కేంద్రం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్గా వ్యవహరిస్తున్న దినేశ్ ఖారా వచ్చే ఏడాది అక్టోబర్లో పదవీ విరమణ చేస్తున్నారు. అలాగే కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తున్న ఎల్వీ ప్రభాకర్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు.
ఈ స్థానంలో బ్యాంక్ ఈడీగా విధులు నిర్వహిస్తున్న కే సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. బీవోబీ ఎండీ, సీఈవో సంజీవ్ వచ్చే నెల చివర్లో రిటైర్డ్కానున్నారు. మరోవైపు, ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ తన పదవి కాలం మార్చి 31, 2023తో ముగియనున్నది. ఆయన స్థానంలో నూతన వ్యక్తి కోసం కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఎల్ఐసీ ఎండీ బీసీ పట్నాయక్ కూడా మార్చి చివర్లో రిటైర్కాబోతున్నారు.
ఐవోబీ బాస్గా అజయ్ కుమార్
ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అజయ్ కుమార్ శ్రీవాత్సవ్కు పదొన్నతి లభించింది. ఆయనను మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నియామకం జనవరి 1 నుంచి అమలులోకి రానున్నది. అలాహబాద్ బ్యాంక్లో 1991లో ప్రొబేషనరీ అధికారిగా సేవలు ఆరంభించిన కుమార్…బ్యాంకింగ్ రంగంలో ఆయనకు 27 ఏండ్ల అనుభవం ఉన్నది.