న్యూఢిల్లీ, మే 10: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్లు లేదా ఆపై బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 0.90 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లు మినహా అన్ని డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించింది బ్యాంక్. పెరిగిన వడ్డీరేట్లు మంగళవారం నుంచే అమలులోకి వచ్చాయి కూడా. వీటితోపాటు సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై వడ్డీరేటుని కూడా 4 శాతం నుంచి 5 శాతం వరకు పెంచింది.