న్యూఢిల్లీ, డిసెంబర్ 1: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కుంభకోణం కేసులో మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. తాజా ఆదేశాలు జారీ చేసింది. మునుపటి ఆ కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగ రాజుతోపాటు మరో నలుగుర్ని, ఓ సంస్థను రూ.624.09 కోట్లు చెల్లించాలంటూ ఆదేశించింది. అంతేగాక 2009 జనవరి 7 నుంచి ఇప్పటిదాకా 12 శాతం వార్షిక వడ్డీతో ఈ మొత్తాన్ని ఇవ్వాలంటూ గురువారం జారీ చేసిన 96పేజీల ఆర్డర్లో బీ రామలింగ రాజు, బీ రామరాజు, బీ సూర్యనారాయణ రాజు, వీ శ్రీనివాస్, జీ రామకృష్ణలతోపాటు ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ కంపెనీకి సెబీ స్పష్టం చేసింది.
2018 అక్టోబర్, నవంబర్లో 12 శాతం వార్షిక వడ్డీతో రూ.840.15 కోట్లు చెల్లించాలని సెబీ ఇచ్చిన ఆదేశాలను రామలింగ రాజుసహా ఆరుగురు సవాల్ చేశారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో శాట్.. మళ్లీ లెక్కించి తాజా ఆదేశాలివ్వాలంటూ సెబీని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సెబీ కొత్త ఆర్డర్ ఇచ్చింది. అలాగే 45 రోజుల్లోగా చెల్లించాలన్నది. దీంతో ఈ కేసు లో చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ.1, 747.5 కోట్లకు చేరింది. ఇందులో రూ.1,1 23 కోట్లు వడ్డీనే కావడం గమనార్హం. 2009 జనవరి 7న ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. అకౌంట్స్లో భారీ అవకతవకలున్నాయి.