హైదరాబాద్, జూలై 1: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ (హెచ్ఎంఏ) అధ్యక్షుడిగా శరత్ చంద్ర మారోజు ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ఏడాది కాలానికిగాను ఎన్నుకున్నారు.
కాగా, సిండిక్ ఇంజినీర్స్ వ్యవస్థాపక సీఈవోగా శరత్ చంద్ర ఉన్నారు. కాగా, హెచ్ఎంఏ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం లభించడం గౌరవప్రదమని ఈ సందర్భంగా శరత్ చంద్ర అన్నారు. అసోసియేషన్ ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు.