బెంగళూరు, జూన్ 3: సంగీత మొబైల్స్ 49వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. రూపాయి మార్జిన్తో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్, టీవీ, ట్యాబ్స్తోపాటు ఇతర ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. వీటితోపాటు రూ.5 వేల వరకు అడ్వాన్స్ క్యాష్, రూ.5 వేల క్యాష్బ్యాక్, ఏడాదంతా డ్యామేజ్ ప్రొటెక్షన్, పలు ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై స్మార్ట్వాచ్తోపాటు ఎక్సేంజ్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అలాగే డెబిట్, క్రెడిట్ కార్డులపై క్యాష్బ్యాక్ను అందిస్తున్నది. ఇంటి నుంచే కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కస్టమర్లకు సంస్థ కల్పించింది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న కస్టమర్కు కేవలం రెండు గంటల్లో డెలివరి చేయనున్నది. దేశవ్యాప్తంగా ఉన్న 800 రిటైల్ అవుట్లెట్లలో ఈ ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉన్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.