న్యూఢిల్లీ : భారత్లో అల్ట్రా ప్రీమియం మైక్రో ఎల్ఈడీ టీవీని (Ultra Premium Micro LED TV) లాంఛ్ చేస్తున్నట్టు శాంసంగ్ బుధవారం ప్రకటిచింది. అసాధారణ ఫీచర్లు, నెక్ట్స్ లెవెల్ టెక్నాలజీతో ఈ టీవీ కస్టమర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లు, శాంసంగ్ అధికారిక వెబ్సైట్లో మైక్రో ఎల్ఈడీ టీవీ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
అల్ట్రా ప్రీమియం మైక్రో ఎల్ఈడీ టీవీ రూ. కోటి 49 లక్షలకు లభిస్తుందని వెల్లడించింది. స్లీక్ డిజైన్తో ఈ మైక్రో ఎల్ఈడీ టీవీ అల్ట్రా ప్రీమియం వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ను కోరుకునే కస్టమర్లను ఆకట్టుకుంటుందని శాంసంగ్ పేర్కొంది. భూమిపై రెండవ హోర్డెస్ట్ మెటీరియల్ అయిన సఫైర్ మెటీరియల్తో రూపొందిన ఈ మైక్రో ఎల్ఈడీ టీవీ అద్భుతమైన విజువల్ అనుభూతిని కలిగిస్తూ వైబ్రాంట్ కలర్స్, క్లారిటీ, కాంట్రాస్ట్తో ఆకట్టుకుంటుంది.
ఈ ప్రీమియం టీవీ లైఫ్లైక్ కలర్ రిప్రెజెంటేషన్, షార్ప్ కాంట్రాస్ట్, ఆప్టమమ్ పీక్ బ్రైట్నెస్, సబ్లైమ్ ఏఐ అప్స్కేలింగ్ వంటి ఫీచర్లను కలిగిఉంది. హైఎండ్ పిక్చర్ క్వాలిటీ కోసం మైక్రో ఎల్ఈడీ, మైక్రో కాంట్రాస్ట్, మైక్రో కలర్, మైక్రో హెచ్డీఆర్, మైక్రో ఏఐ ప్రాసెసర్లతో కస్టమర్ల ముందుకొచ్చింది. అరెనా సౌండ్ ఫీచర్ 3డీ సౌండ్ సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. ఓటీఎస్ ప్రో, డాల్బీ అట్మాస్, క్యూ-సింఫనీ కాంపోనెంట్స్తో ఈ వెసులుబాటు కల్పిస్తుందని కంపెనీ వెల్లడించింది.
Read More :
Exercise | వర్షం పడుతుందని వాకింగ్ మానేస్తున్నారా? వీటితో ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకోండి