Smart Phones Sales | సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయంగా 4.4 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయి. అయితే, సెప్టెంబర్ ఫోన్ విక్రయాలు 2019 స్థాయికి పడిపోయాయని, దీనికి కారణం ఫోన్ల ధరలు భారీగా ఉండటమేనని ఇంటర్నేషనల్ డేటా కార్పోరేషన్ (ఐడీసీ) పేర్కొంది. తిరిగి దేశీయ స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో శాంసంగ్.. మొదటి స్థానానికి చేరుకున్నదని తెలిపింది. గతేడాదితో పోలిస్తే గ్రోత్ నమోదు కాలేదని పేర్కొంది.
జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 16 శాతం పెరిగాయి. 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 58 శాతం పుంజుకుని 2.5 కోట్లకు చేరాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్ముడైన స్మార్ట్ ఫోన్ల ధర రమారమీ సగటున రూ.8,330గా నిలిచిందని ఐడీసీ వెల్లడించింది.
దేశీయ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో.. చైనా సంస్థ వివోను దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ దాటేసి తిరిగి మొదటి స్థానానికి చేరుకున్నది. శాంసంగ్ ఫోన్ల విక్రయాలు తగ్గినా.. విలువ పరంగా తన వాటా పెంచుకున్నది. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో తొలి స్థానంలో ఉన్న శాంసంగ్.. మార్కెట్లో 16.2 శాతం వాటా కలిగి ఉంది. తర్వాతీ స్థానాల్లో రియల్ మీ 15.1, వివో 13.9, షియోమీ 11.7 శాతం, ఒప్పో 9.9 శాతం వాటా పొందాయి.