హైదరాబాద్, మార్చి 29: సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది సామ్సంగ్. 5జీ పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా గెలాక్సీ ఏ54, ఏ34ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఏ54 మొబైల్ రూ.38,999 నుంచి రూ.40,999 వరకు, ఏ34 మాడల్ రూ.30,999 నుంచి రూ.32,999 మధ్యలో నిర్ణయించినట్టు కంపెనీ జీఎం అక్షయ్ రావు తెలిపారు.