హైదరాబాద్, అక్టోబర్ 19: సైయెంట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.183.6 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.79.1 కోట్ల లాభంతో పోలిస్తే 66 శాతం వృద్ధి కనబరిచింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 27.38 శాతం అధికమై రూ.1,778.5 కోట్లకు చేరుకున్నది. గత త్రైమాసికంలో డిజిటల్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలకి చెందిన 5 అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు పేర్కొంది. రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది.