న్యూఢిలీ: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ (75) మంగళవారం ముంబయిలోని ఓ ప్రైవేట్ దవాఖానలో కన్నుమూశారు. బీహార్లోని ఆరారియాలో 1948 జూన్ 10న జన్మించిన సుబ్రతా రాయ్, గోరఖ్పూర్లోని ప్రభుత్వ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. 1976లో ‘సహారా ఫైనాన్స్’ పేరుతో చిన్న చిట్ ఫండ్ కంపెనీని స్థాపించారు.
ఆ తర్వాత దీనిని 1978లో సహారా పరివార్గా మార్చారు. అక్కడ్నుంచి వివిధ రంగాల్లోకి తన వ్యాపారాన్ని విస్తరించారు. ఫైనాన్స్, రియల్ఎస్టేట్, మీడియా, ఆతిథ్యరంగాల్లో సహారా పరివార్ను పేరొందిన సంస్థగా తీర్చిదిద్దారు. సహారా ఇండియాలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఆయన మీద పలు కేసులు నమోదయ్యాయి. సెబీ కేసులో కోర్టులో హాజరుకానందుకు ఆయన్ని అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు 2014లో ఉత్తర్వులు జారీచేసింది. చివరి రోజులు తీహార్ జైల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత పెరోల్పై విడుదలయ్యారు.