హైదరాబాద్, డిసెంబర్ 22: రాష్ర్టానికి చెందిన ఏరోస్పేస్, రక్షణ, ఎనర్జీ రంగ విడిభాగాల తయారీ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీవోకి అపూర్వ స్పందన లభించింది. సంస్థ జారీచేసిన షేర్లకు 80.60 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి.
శుక్రవారంతో పబ్లిక్ ఇష్యూ ముగియగా, 1,01,22,705 షేర్లకుగాను 81,58,60,388 షేర్ల బిడ్డింగ్లు వచ్చాయని కంపెనీ పేర్కొంది. షేర్ ధరల శ్రేణి రూ.499-524గా ఉన్నది. ఇదిలావుంటే ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తోపాటు పీవీ సింధు, సైనా నెహ్వాల్, వీవీఎస్ లక్ష్మణ్లకు ఈ సంస్థలో వాటాలుం డటం విశేషం.