ముంబై, డిసెంబర్ 8: డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మరో 4 పైసలు పడిపోయింది. దీంతో శుక్రవారం ఫారెక్స్ ట్రేడింగ్లో 83.40 వద్ద భారత కరెన్సీ నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా కరెన్సీ బలపడటం, ముడి చమురు ధరలు మళ్లీ పుంజుకుంటుండటం.. రూపాయిని దెబ్బ తీస్తున్నాయని ఫారెక్స్ ట్రేడర్లు తాజా సరళిని విశ్లేషిస్తున్నారు. కాగా, ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్ వద్ద రూపాయి మారకం విలువ 83.35 దగ్గర మొదలై, 83.40 వద్ద ముగిసింది.
గురువారం కూడా రూపాయి విలువ 4 పైసలు దిగజారి 83.46 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజా ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వైఖరితో సమీప భవిష్యత్తులో రూపాయి పుంజుకోవచ్చన్న అంచనాల్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. రికార్డు స్థాయి లాభాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా రుపీని బలపర్చగలవని చెప్తున్నారు.