ముంబై : మీరు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్య రూ రెండు లక్షలు అంతకుమించి భారీ లావాదేవీలకు ప్లాన్ చేస్తే మీ ఆర్టీజీఎస్ షెడ్యూల్ ను మార్చుకుంటే మంచిది. ఎందుకుంటే ఈ వ్యవధిలో ఆర్టీజీఎస్ పలు గంటల పాటు పనిచేయదు.
ఏప్రిల్ 17 పని గంటల అనంతరం మరుసటి రోజు ఆదివారం మద్యాహ్నం రెండు గంటల వరకూ సాంకేతిక అప్ గ్రేడ్ నిమిత్తం ఆర్టీజీఎస్ పనిచేయదని, బ్యాంకు కస్టమర్లకు ఆ సమయంలో ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండవని ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ సమాచారం చేరవేయాలని ఆర్బీఐ కోరింది. ఈ సమయంలో కస్టమర్లు నెఫ్ట్ ద్వారా నగదు బదిలీలను చేపట్టవచ్చు.