న్యూఢిల్లీ, మార్చి 24: చైనాకు చెందిన మొబైల్ సంస్థ వన్ప్లస్ ఇండియా సీఈవో రోబిన్ లియూ తన పదవికి రాజీనామా చేశారు. అమ్మకాలు పడిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో సీఈవో రాజీనామా చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఆయ న వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టు, భవిష్యత్తులో ఆయనకు మంచే జరుగాలని కోరుకుంటున్నట్టు కంపెనీ పేర్కొంది.
సీఈవో రాజీనామా చేసినప్పటికీ ప్రాంతీయ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం పడదని వెల్లడించింది. గతేడాదిలో కంపె నీ అమ్మకాలు 32 శాతం పడిపోయాయని సైబర్మీడియా రీసర్చ్ తన నివేదికలో వెల్లడించింది.