Layoffs | ముంబై, జనవరి 24: ద్రవ్యోల్బణం పెరగడం, ఉద్యోగం భద్రంగా ఉంటుందో లేదో అన్న అందోళనలు పట్టణవాసుల్లో అధికమయ్యాయని అంతర్జాతీయ మార్కెటింగ్ డేటా, బిజినెస్ అనలిటిక్స్ సంస్థ కాంటర్ పేర్కొంది. 2024-25 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ను ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కాంటర్ ఇండియా కేంద్ర బడ్జెట్ సర్వేను బుధవారం విడుదల చేసింది. ఎన్నికల సంవత్సరం అయినందున ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం స్పందిస్తుందన్న అంచనాలు సర్వేలో వ్యక్తమయ్యాయని, ద్రవ్యోల్బణం అదుపునకు కఠిన చర్యలు చేపడుతుందని, ఆదాయపు పన్నుల్లో ఊరట లభిస్తుందని పట్టణవాసులు భావిస్తున్నారని కాంటర్ దక్షిణాసియా డివిజన్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ దీపేందర్ రాణా చెప్పారు.
సర్వే వివరాలు&