ముంబై, డిసెంబర్ 27: బ్యాంకింగ్ రంగంలో మోసాలను అరికట్టడానికి రిజర్వుబ్యాంక్, కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సత్ఫలితాలను ఇవ్వడం లేదు కదా అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బ్యాంకింగ్ రంగంలో 14,483 మోసాలు జరిగాయి.
క్రితం ఏడాది ఇదే సమయంలో జరిగిన మోసాల కంటే ఇది 14.9 శాతం అధికమని రిజర్వు బ్యాంక్ తాజాగా విడుదల చేసిన ‘ట్రెండ్ అండ్ ప్రొగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2022-23 నివేదికలో వెల్లడించింది. సంఖ్య పరంగా చూస్తే భారీగా పెరిగినప్పటికీ విలువ పరంగా చూస్తే మాత్రం భారీగా తగ్గాయి. ఏడాది క్రితం ఆరు నెలల్లో 5,396 మోసాలు జరుగగా, వీటి విలువ రూ.17,685 కోట్లు. ఈసారి 14,484 మోసాలు జరిగితే వీటి విలువ రూ.2,642 కోట్లు అని పేర్కొంది.