Vizag Steel Plant | కోల్కతా, నవంబర్ 14: వైజాగ్ స్టీల్గా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ఆస్తుల్ని విక్రయించడానికి మోదీ సర్కారు సిద్ధమైంది. కంపెనీకి వైజాగ్లో ఉన్న భూముల్ని, ఉత్తరప్రదేశ్లో ఉన్న ట్రైన్ ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ను విక్రయించి రూ.3,000-4,000 కోట్లు సమీకరిస్తామని ఆర్ఐఎన్ఎల్ సీఎండీ అతుల్ భట్ చెప్పారు.
మంగళవారం కోల్కతాలో జరిగిన ఓ సదస్సులో భట్ మాట్లాడుతూ.. వచ్చే ఆదాయంతో సంస్థ రుణాన్ని తగ్గించి, వర్కింగ్ క్యాపిటల్ను సమకూర్చుకుంటామన్నారు. కాగా, ఆర్ఐఎన్ఎల్కు 6,000 ఎకరాల గ్రీన్బెల్ట్సహా మొత్తం 19,000 ఎకరాల భూములున్నాయి.