మర్కూక్(నమస్తే తెలంగాణ), మే 28: హైదరాబాద్కు అత్యంత సమీపంలోని కర్కపట్ల బయోటెక్ పార్క్ ఫేజ్-3లో రెట్ హెల్త్కేర్ ఫార్యులేషన్ ఏర్పాటు చేసిన యూనిట్ను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు ప్రారంభించారు. రూ.15.96 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్తో వంద మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..రాష్ట్రంలో అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన వైద్య పరికరాలు ఇక్కడే తయారవుతున్నాయని, దీంతో ప్రపంచంలో తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగానే కర్కపట్లలో 500 ఎకరాలతో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈవో రఘువీర్ మాట్లాడుతూ..ఫార్మా హబ్గా వెలుగొందుతున్న హైదరాబాద్లో రూ.16 కోట్ల పెట్టుబడితో యూనిట్ను నెలకొల్పడం సంతోషంగా ఉన్నదని, ఈ ప్లాంట్లో ట్యాబ్లెట్లు, క్యాప్సుల్స్, పౌడర్లు, క్రీమ్స్, జెల్, లోషన్లు, ఆర్గానిక్ సోప్స్ వంటివి ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు.