శంషాబాద్ రూరల్, అక్టోబర్ 28: రాష్ట్రం నుంచి బ్యాంకాక్ వెళ్లేవారి ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి థాయ్ ఎయిర్ఏషియా మరో విమాన సర్వీసును సోమవారం ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి నేరుగా బ్యాంకాక్ వెళ్లే ఈ విమాన సర్వీసును శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పణికర్ ప్రారంభించారు.
సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఈ విమాన సర్వీసు నడవనున్నదని ఆయన వెల్లడించారు. హైదరాబాద్లో రాత్రి 11.25 గంటలకు బయలుదేరనున్న ఈ విమాన సర్వీసు ఆ మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు బ్యాంకాక్ చేరుకోనున్నది. తిరుగు ప్రయాణంలో బ్యాంక్క్లో రాత్రి 8.50 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 10.55 గంటలకు హైదరాబాద్కు చేరుకోనున్నది.