హైదరాబాద్, ఏప్రిల్ 10: ఈ ఏడాదికిగాను జుయెల్లరీ రిటైల్ బ్రాండ్ అవార్డును సొంతం చేసుకున్నది ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జీఆర్టీ. హైదరాబాద్లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఎకనామిక్స్ టైమ్స్ ఈ అవార్డుతో సంస్థను సత్కరించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ జీఆర్ ఆనంద్ మాట్లాడుతూ.. ఈటీ ఎక్సలెన్స్ అవార్డ్ ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో జుయెల్లరీ రిటైల్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అందుకోవడం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నామన్నారు.