న్యూఢిల్లీ : జులైలో ఆహారోత్పత్తుల ధరలు కొంత దిగిరావడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 5.59 శాతానికి తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇక గత ఏడాది జూన్లో వినిమయ ధరల సూచీ ద్రవ్యోల్బణం 6.26 శాతం, జులైలో 6.73 శాతంగా నమోదైందని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) డేటా తెలిపింది.
ఇక ఈ ఏడాది జులైలో ఆహోరోత్పత్తుల ధరలు అంతకుముందు నెలలో నమోదైన 5.15 శాతం నుంచి 3.96 శాతానికి దిగివచ్చాయి. ఇక 2021-22లో వినిమయ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది.