ముంబై: ఈ-కామర్స్ బిజినెస్లో రిలయన్స్ జియోమార్ట్.. టాటా డిజిటల్ అనుబంధ టాటా సూపర్ యాప్ మధ్య బిగ్ కార్పొరేట్ బాటిల్ ఎదురు కానున్నది. రెండు సంస్థలు కూడా నువ్వా.. నేనా? అన్నట్లు పోటీ పడనున్నాయి.
వీటితోపాటు పేటీఎం, అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి కూడా జియో మార్ట్కు గట్టి పోటీ ఎదురవుతుంది. జియో మార్ట్ ప్రస్తుతం ఫైనాన్సియల్ సర్వీసులతోపాటు గ్రాసరీ, నాన్-గ్రాసరీ ఉత్పత్తులను విక్రయిస్తున్నది.
అయితే, వచ్చే నాలుగేండ్లలో రిలయన్స్ ఈ కామర్స్ రెవెన్యూ 35 శాతం పెరిగి 15 బిలియన్ల డాలర్లకు చేరుతుందని గోల్డ్మాన్ సాచ్స్ అంచనా వేసింది. రిలయన్స్ రిటైల్ రెవెన్యూ 44 బిలియన్ల డాలర్లకు దూసుకెళ్లుందని పేర్కొంది.
టాటా వర్సెస్ జియోమార్ట్ మధ్య సాగే ఈ-కామర్స్ సేవల యుద్ధం.. తదుపరి బిగ్ కార్పొరేట్ బాటిల్గా పరిణమించొచ్చు.
టాటా సన్స్కు సొంత ఉత్పత్తులు, బ్రాండ్ల మద్దతు ఉంది. గ్లోబల్ జెయింట్స్ గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ సంస్థల దన్ను రిలయన్స్కు మెండు.
ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్లో 2025 నాటికి రిలయన్స్ వాటా 50 శాతం ఉంటుందని, మొత్తం ఈ-కామర్స్లో 30 శాతం మార్కెట్ను కైవసం చేసుకుంటుందని గోల్డ్మాన్ సాచెస్ అనలిస్ట్ నిఖిల్ భండారీ చెప్పారు. గ్రాసరీ అండ్ నాన్ గ్రాసరీ సెగ్మెంట్లలో బిజినెస్ 19 బిలియన్ల డాలర్లను తాకుతుందన్నారు.
కరోనాతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో రిలయన్స్ రిటైల్ బిజినెస్ 2015-16 నుంచి 2020 మధ్య ఐదు రెట్లు పెరిగింది.
ఈ-కామర్స్తోపాటు రిటైల్ బిజినెస్.. రిలయన్స్ భవిష్యత్ గ్రోత్ ఇంజిన్గా అవతరిస్తుందని విశ్వసిస్తున్నట్లు నిఖిల్ భండారీ తెలిపారు.
రిలయన్స్ ఈ-కామర్స్ సూపర్ యాప్ జియో మార్ట్ ఇప్పటికే గ్రాసరీ, దుస్తులు, ఫార్మాస్యూటికల్స్, పర్సనల్ అండ్ హోం కేర్ ఉత్పత్తుల వరకు విక్రయిస్తున్నది.
రిలయన్స్ ప్రత్యర్థి టాటా సన్స్ అనుబంధ టాటా డిజిటల్ కూడా ఫైనాన్సియల్ అండ్ ట్రావెల్ అనుబంధ ఉత్పత్తులను ప్రారంభించనున్నది.
టాటా మోటార్స్, టాటా సియా ఎయిర్లైన్స్, ఎయిర్ ఏషియా ఇండియా, ఇండియా హోటల్స్ ఆధ్వర్యంలోని తాజ్ గ్రూప్ హోటళ్లు, తనిష్క్, టైటాన్ వంటి బ్రాండ్లు టాటా సూపర్ యాప్కు దన్నుగా నిలుస్తాయి.
బిగ్ బాస్కెట్ అనే రిటైల్ చైన్ నెట్వర్క్తోపాటు ఎన్ ఎంజీ.. వంటిఫార్మా కంపెనీలను టేకోవర్ చేసింది.
టాటా బ్రాండ్ ఉత్పత్తులన్నీ టాటా సూపర్ యాప్ ద్వారా సేల్ అవుతాయి.
తద్వారా జియోమార్ట్ గట్టి పోటీనెదుర్కోక తప్పకపోవచ్చు. అయితే, జియో మార్ట్ కూడా ఓబేరాయ్ హోటల్స్ బుకింగ్స్ చేపట్టనున్నది.
జియో ప్లాట్ఫామ్స్లో వాటాదారులైన టెక్ దిగ్గజాలతో కలిసి రిలయన్స్ పలు ఉత్పత్తులను ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ సంస్థలు జియోమార్ట్కు వెన్నెముకగా నిలువనున్నాయి.
ఫుడ్ అండ్ గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ తదితర క్యాటగిరీల బిజినెస్తో కలిపి దేశీయ రిటైల్ మార్కెట్లో రిలయన్స్ వాటా 76 శాతంగా ఉంది.
ఎలక్ట్రానిక్స్ మినహా అసంఘటిత రంగంలోని రిటైల్ మార్కెట్ నుంచి లబ్ధి పొందేందుకు ప్లాన్ రూపొందించింది. అందుకు ద్వితీయ, త్రుతీయ శ్రేణి నగరాలపై ఫోకస్ చేసింది.