హైదరాబాద్, జనవరి 21: రిలయన్స్ స్మార్ట్ బజార్ ‘ఫుల్ పైసా వసూల్ సేల్’ మళ్లీ వచ్చేసింది. శనివారం మొదలైన ఈ సేల్.. ఈ నెల 26 వరకు కొనసాగనున్నది.
ఈ సందర్భంగా ఆహారోత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, డెయిరీ, దుస్తులు, హోమ్వేర్, స్మాల్ అప్లియెన్సెస్లపై కస్టమర్లు పెద్ద ఎత్తున ఆదా చేసుకోవచ్చని సంస్థ తెలియజేసింది. బిస్కట్లు, కూల్డ్రింక్స్, షాంపూలు, సబ్బులు, టూత్పేస్ట్, 5కేజీ బియ్యం ధరలపై 50 శాతం వరకు తగ్గింపు ఉంటుందని స్పష్టం చేసింది.