Ambani Sucession Plan | రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయులు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ, అనంత్ అంబానీలను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమిస్తూ బోర్డు చేసిన తీర్మానాన్ని వాటాదారులు ఆమోదించారు. ఆకాశ్ అంబానీ, ఈశా అంబానీ, అనంత్ అంబానీలను బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించినట్లు రిలయన్స్ శుక్రవారం స్టాక్ ఎక్స్చేంజీల ఫైలింగ్ లో తెలిపింది. ఇటీవల జరిగిన సంస్థ 46వ సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ తన వారసత్వ ప్రణాళికను ప్రకటించారు.
కవల పిల్లలు ఆకాశ్, ఈశా అంబానీలకు 98 శాతం, వీరి కంటే మూడేండ్లు చిన్నవాడైన అనంత్ అంబానీకి 92.75 శాతం మంది వాటాదారులు ఆమోదం తెలిపారు. గత ఆగస్టులోనే వీరి నియామకానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. వాటాదారులు కూడా ఆమోదించడంతో వారు బాధ్యతలు చేపట్టడం లాంఛనమే.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ రిలయన్స్ బోర్డ్ డైరెక్టర్గా ఉన్న నీతా అంబానీ తన వారసుల కోసం బోర్డు నుంచి తప్పుకున్నారు. ఇక నుంచి నీతా అంబానీ పూర్తిగా రిలయన్స్ ఫౌండేషన్ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. గతేడాది రిలయన్స్ జియో ఇన్ఫోకాం చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. రిలయన్స్ రిటైల్ బాధ్యతలను ఈశా అంబానీ, న్యూ ఎనర్జీ బిజినెస్ బాధ్యతలు అనంత్ అంబానీ చేపట్టారు.