Reliance-Metro | మెట్రో క్యాష్ & క్యారీ ఇండియా బిజినెస్ను రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకుంది. ఈ మేరకు మెట్రో క్యాష్ & క్యారీ ఇండియాలో వందశాతం వాటాల టేకోవర్ కోసం కుదిరిన ఒప్పందంపై రిలయన్స్ రిటైల్ సంతకం చేసింది. రూ.2,850 కోట్లకు మెట్రో క్యాష్ అండ్ క్యారీని రిలయన్స్ సొంతం చేసుకుంది. దీంతో మెట్రో ఇండియా నెట్వర్క్ మొత్తం రిలయన్స్ పరం అవుతాయి. మెట్రోకు దేశంలోని ప్రధాన నగరాల పరిధిలో రిజిస్టర్డ్ కిరాణా స్టోర్స్ ఉన్నాయి. రెగ్యులేటరీ, ఇతర సంస్థలు, కేంద్ర ప్రభుత్వశాఖల ఆమోదం లభించిన తర్వాత వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి డీల్ పూర్తవుతుందని భావిస్తున్నారు.
2003లో క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ ఫార్మాట్లో మెట్రో ఇండియా సేవలు ప్రారంభించింది. దేశంలోని 21 నగరాల పరిధిలో 31 అతిపెద్ద స్టోర్స్ నిర్వహిస్తున్నది. ఇందులో సుమారు 3,500 మంది సిబ్బంది పని చేస్తున్నారు. సెప్టెంబర్తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి మెట్రో ఇండియా సేల్స్ రూ.7,700 కోట్లకు చేరుకున్నాయని రిలయన్స్ రిటైల్ తెలిపింది.
స్మాల్ మర్చంట్స్, ఎంటర్ప్రైజెస్ సహకారంతో సంపద పంపిణీకి నూతన వాణిజ్య వ్యూహంతో మెట్రో ఇండియా క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ను సొంతం చేసుకుంటున్నట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. భారత్ బిజినెస్ టు బిజినెస్ మార్కెట్లో మల్టీ చానెల్ ప్లాట్ఫామ్ నిర్మాణంతోపాటు సమర్థవంతమైన కస్టమర్ల అనుభవం కలిగి ఉన్న సంస్థ మెట్రో ఇండియా అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మెట్రో ఇండియా టేకోవర్తో గృహిణులు, కిరాణాలు, మర్చంట్లు, హోటల్స్, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సంస్థలు సహా భారత సమాజం అంతటికి సేవలందించేందుకు వెసులుబాటు కలిగిందని ఈషా అంబానీ తెలిపారు. సరైన టైంలో ప్రాఫిటబుల్ హోల్సేల్ బిజినెస్ను విక్రయిస్తున్నట్లు మెట్రో ఏజీ సీఈవో డాక్టర్ స్టీఫెన్ గ్రౌబెల్ తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో మెట్రో ఇండియా బిజినెస్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగల భాగస్వామి రిలయన్స్ అని గుర్తించామన్నారు.
Reliance on Metro | మెట్రో మాల్స్పై రిలయన్స్.. టేకోవర్కు సింగిల్ బిడ్డర్?!
Swiggy eye on Metro | మెట్రో కోసం స్విగ్గీ పోటీ.. బరిలో టాటా.. రిలయన్స్ & అమెజాన్!