Reliance | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో 27 శాతం గ్రోత్ సాధించింది. 2022-23 రెండో త్రైమాసికంలో రూ.13,656 కోట్ల నికర లాభం గడిస్తే, సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.17,394 కోట్ల లాభం సముపార్జించింది. రిలయన్స్ రిటైల్ నికర లాభం 21 శాతం పెరిగి రూ.2790 కోట్లకు చేరుకుంది. ఇటీవలే విడి వడిన రిలయన్స్ ఆర్థిక సేవల సంస్థ ‘జియో ఫైనాన్సియల్ సర్వీసెస్’ నికర లాభం రూ.66.8.2 కోట్ల వద్ద నమోదైంది. ఇంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే రెట్టింపు నికర లాభం గడించింది. కార్యకలాపాల ద్వారా జియో ఫైనాన్సియల్ అధిక ఆదాయం సంపాదించడమే దీనికి కారణం.
రిలయన్స్ జియో నికర లాభం 12 శాతం పెరుగుదలతో రూ.5059 కోట్లకు చేరుకున్నది. గతేడాది రూ.4518 కోట్ల నికర లాభం మాత్రమే సంపాదించింది. గతేడాది రెండో త్రైమాసికం ఆదాయం రూ.22633 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.24,856 కోట్లకు చేరుకున్నది. రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో రిలయన్స్ షేర్ 1.75 శాతం పెరిగి రూ.2,265.25 వద్ద స్థిర పడింది.