Jio Bonds | రిలయన్స్ జియో మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రుణ భారం తగ్గించుకునేందుకు బాండ్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు బాండ్ల మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక విలువ గల రూపీ బాండ్ విక్రయించాలని.. తద్వారా మార్కెట్ వాటా పెంచుకోవాలని తలపెట్టింది. ఐదేండ్ల గడువుతో కూడిన బాండ్లను విడుదల చేయనున్నది. రూ.5000 కోట్ల (671 మిలియన్ల డాలర్లు) విలువ గల బాండ్లు జారీ చేస్తుంది. వీటిపై 6.20 శాతం విలువైన కూపన్లను జారీ చేస్తుందని జియో సన్నిహిత వర్గాలు తెలిపాయి. గతంలోనూ నాలుగేండ్ల క్రితం అంటే 2018లో బాండ్లు జారీ చేసింది.
2016లో వైర్లెస్ టెలికం రంగంలోకి జియో ఎంట్రీ ఇచ్చింది. ఆల్ట్రా చీప్ డేటా, అన్లీజ్డ్ టారిఫ్ వార్తో జియో ఎంటరవ్వడంతో అప్పటి వరకు మార్కెట్లో ఉన్న 12 సంస్థల్లో కొన్ని నిష్కమించాయి. మరికొన్ని విలీనం అయ్యాయి. ఇంకొన్ని దివాళా తీశాయి. ప్రస్తుతం మూడు ప్రైవేట్ టెలికం సర్వీస్ ప్రొవైడర్లు సేవలందిస్తున్నాయి.