హైదరాబాద్, జనవరి 21: రిలయన్స్ డిజిటల్ తమ ‘డిజిటల్ ఇండియా సేల్’ను మరోమారు తీసుకొచ్చింది. వివిధ రకాల ఎలక్ట్రానిక్స్పై అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను పరిచయం చేసింది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లతోపాటు www.reliancedigital. in లో ఈ నెల 29 వరకు అన్ని క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ.20,000 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్లను పొందవచ్చని సంస్థ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఈజీ ఫైనాన్స్, ఈఎంఐ సదుపాయం కూడా ఉంటుందని తెలియజేసింది. కస్టమర్ల కోసం షరతులకు లోబడి ఇన్స్టా డెలివరీ, స్టోర్ పిక్-అప్ ఆప్షన్లూ ఉన్నాయన్నది.