హైదరాబాద్, అక్టోబర్ 22: దీపావళి సందర్భంగా రిలయన్స్ డిజిటల్.. తమ కొనుగోలుదారులకు డిస్కౌం ట్లు, వోచర్లు, క్యాష్బ్యాక్లు, ఈజీ ఈఎంఐ సౌకర్యం, మరెన్నో ఆఫర్లను అందిస్తున్నది. ఎలక్ట్రానిక్స్ సేల్ ఫెస్టివల్లో భాగంగా ఐఫోన్ 12 ప్రారంభ ధర రూ.29,900లుగా ప్రకటించింది. అలాగే సామ్సంగ్ ఎమ్13 5జీ రూ.13,999, సామ్సంగ్ ఎస్22 రూ.52,999 ప్రారంభ ధరలకే లభిస్తాయని స్పష్టం చేసింది. అంతేగాక రూ.999లకే స్మార్ట్ వాచీలు, రూ.1,499లకే బీటీ-కాలింగ్ వాచీలు, 14,990లకే యాపిల్ స్మార్ట్వాచీలు కొనుక్కోవచ్చని తెలిపింది. ఇక టీసీఎల్ క్యూఎల్ఈడీ ధర రూ.36,990 మాత్రమేనని వెల్లడించింది. సామ్సంగ్ నియో క్యూఎల్ఈడీ కొనుగోలుపై ఐదేండ్ల వారెంటీతోపాటు రూ.21,490 విలువైన సామ్సంగ్ ఏ32 మొబైల్ పొందవచ్చు. ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషీన్లు రూ.19,490కే లభిస్తాయని, రెండేండ్ల వారెంటీ కూడా ఉంటుందని ఈ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ తెలియజేసింది. వీటితోపాటు సౌండ్బార్స్, ఎయిర్పాడ్స్, గేమర్హెడ్స్లను సరసమైన ధరలకే పొందవచ్చని వివరించింది. రిలయన్స్ డిజిటల్ స్టోర్లతోపాటు మై జియో స్టోర్లు, www.reliance digital.in వద్ద ఆఫర్లుంటాయని సంస్థ చెప్పింది.