హైదరాబాద్, ఆగస్టు 13: దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ విక్రయ సంస్థ రిలయన్స్ డిజిటల్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 16 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్లు ప్రముఖ బ్యాంకులకు చెందిన కార్డుల ద్వారా కొనుగోలు చేసిన అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చునని తెలిపింది. దీంతోపాటు తదుపరి కొనుగోలుపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ వోచర్ను కూడా పొందవచ్చును. 65 అంగుళాల యూహెచ్డీ ఆండ్రాయిడ్ టీవీలను రెండు సంవత్సరాల వ్యారెంటీతో కేవలం రూ.49,990 ప్రారంభ ధరతో, 43 అంగుళాల యూహెచ్డీ ఆండ్రాయిడ్ టీవీలను రూ.19,990 ప్రారంభ ధరతో అందిస్తున్నది. దీంతోపాటు రెండో జనరేషన్ యాపిల్ ఎయిర్ పాడ్స్ రూ.8,490 విక్రయిస్తున్నది. వీటితోపాటు ల్యాప్టటాప్లు, ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలను కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కల్పించింది. ఈ లక్కీ డ్రాలో కార్లు, బైకులు, టీవీలు, ఫోన్లు గెలుచుకునే అవకాశం ఉన్నది.