న్యూఢిల్లీ, జూన్ 10: రిలయన్స్ ఇండస్ట్రీస్..సోషల్ మీడియా సంస్థ మెటా చేతులు కలిపాయి. వచ్చే రెండేండ్లలో గుజరాత్లోని జామ్నగర్ వద్ద 168 మెగావాట్ల సామర్థ్యంతో డాటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయి.
దేశీయంగా ఏర్పాటవుతున్న తొలి బిల్ట్-టూ-స్యూట్ డాటా సెంటర్ ఇదే కావడం విశేషం. ఏఐ మౌలిక సదుపాయాల రంగంలో దూసుకుపోతున్న భారత్కు ఇదొక మైలురాయి వంటిదని ఒక ప్రకటనలో వెల్లడించాయి. రెన్యువబుల్ ఎనర్జీ, ఉప్పు తీసివేసిన సముద్రపు నీటితో ఈ డాటా సెంటర్ పనిచేయనున్నది.