హైదరాబాద్, జూన్ 18: జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో నష్టాల్ని రూ.723.36 కోట్లకు తగ్గించుకుంది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ రూ.1,126 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. ఆదాయం స్వల్పంగా రూ.2,554 కోట్ల నుంచి 2,519 కోట్లకు తగ్గినట్లు శుక్రవారం స్టాక్ ఎక్ఛేంజ్లకు సమర్పించిన ఫైలింగ్లో జీఎంఆర్ తెలిపింది. విద్యుత్, రహదారుల విభాగాలు నష్టాలకు కారణమని, కొవిడ్ సంక్షోభంతో తమ విమానాశ్రయాలు, విద్యుత్, హైవేల వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడిందని కంపెనీ పేర్కొంది.