న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: బొగ్గు దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్యకాలంలో 36.69 శాతం తగ్గి 19.36 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం 30.58 మిలియన్ టన్నులే. విద్యుత్కు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ బొగ్గు దిగుమతులు తగ్గుముఖం పట్టడం విశేషమని బొగ్గు మంత్రిత్వ శాఖ అన్నది.