బెంగళూరు, జనవరి 10:సంగీతా మొబైల్స్లోనూ రెడ్మీ నోట్ 13 5జీ స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చా యి. బెంగళూరు యలహంకలో ఉన్న కంపెనీ స్టోర్లో ఈ స్మార్ట్ఫోన్ విడుదలైంది. నూతన సిరీస్లో భాగంగా రెడ్మీ..నోట్ 13, నోట్ 13 ప్రో, నోట్ 13 ప్రో ప్లస్ వంటి మాడళ్లను ప్రవేశపెట్టింది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హెలియో 9200+ ప్రాసెసర్, 8జీబీ, 128 జీబీ మెమొరీతో లభించనున్నాయి.