Redmi Note 12 5G | షియోమీ తన సబ్ బ్రాండ్ రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వీటితోపాటు రెడ్ మీ 12 ప్రో 5జీ, రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ ఫోన్ల ధరలు కూడా సవరించింది. గత జనవరిలో ఈ ఫోన్లను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది షియోమీ.
జనవరిలో మార్కెట్లో ఆవిష్కరించినప్పుడు రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్ 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999గా ప్రకటించింది. ఇప్పుడు దానిపై నేరుగా రూ.1000 తగ్గించగా, ఐసీఐసీఐ బ్యాంక్ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారు రూ.2000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంటే రూ.14,999లకే ఈ ఫోన్ లభిస్తుంది.
హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నా, ఐసీఐసీై నెట్ బ్యాంకింగ్ ద్వారా కొనుగోలు చేసినా రూ.2000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ తోపాటు ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.2000 రాయితీ ప్రకటించింది. అంటే రూ.17,999 ఉన్న రెడ్ మీ 12 5జీ ఫోన్ రూ.12,999లకే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.
ఇదే ఫోన్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999. తాజాగా అన్ని డిస్కౌంట్లతో కలిపి 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.16,999, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.18,999లకు సొంతం చేసుకోవచ్చు.