న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశంలో తొలిసారిగా రిజర్వ్బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అయిన డిజిటల్ రుపీ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కొత్త కరెన్సీతో ప్రభుత్వ బాండ్లలో వివిధ బ్యాంకులు మంగళవారం లావాదేవీలు జరిపాయి. డిజిటల్ రుపీని ఉపయోగించి తొలిరోజున రూ.275 కోట్ల విలువైన బాండ్లలో బ్యాంక్లు ట్రేడ్ చేసినట్టు క్లియరింగ్ కార్పొరేషన్ గణాంకాలు వెల్లడించాయి.
ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా హోల్సేల్ విభాగంలో డిజిటల్ రుపీలో లావాదేవీలు జరిపేందుకు తొమ్మిది బ్యాంక్లకు రిజర్వ్బ్యాంక్ అనుమతించిన సంగతి తెలిసిందే. 7.38 శాతం వడ్డీగల 2027 బాండ్లలో 140 కోట్ల విలువైన 24 ట్రేడ్స్ జరగ్గా, 7.26 శాతం వడ్డీగల 2032 బాండ్లలో రూ.130 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. 6.54 శాతం వడ్డీతో కూడిన 2032 బాండ్లో ఒక ట్రేడ్ జరిగింది.