న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దీపావళి తర్వాత వాణిజ్య బ్యాంక్ల నుంచి ఖాతాదారులు పెద్ద ఎత్తున డిపాజిట్లను ఉపసంహరించుకున్నారు. నవంబర్ 5-19 మధ్యకాలంలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్ల వద్దనున్న డిపాజిట్లు రూ.2.68 లక్షల కోట్ల మేర తగ్గినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ 5నాటికి బ్యాంక్ల వద్ద రూ.160.47 లక్షల కోట్ల డిపాజిట్లు ఉండగా, నవంబర్ 19 నాటికి అవి రూ.157.79 లక్షల కోట్లకు తగ్గాయి. నవంబర్ 19తో ముగిసిన పక్షం రోజుల్లో క్యాపిటల్ మార్కెట్లోకి వచ్చిన భారీ ఐపీవోలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇన్వెస్టర్లు డిపాజిట్లను విత్డ్రా చేసుకోవడమే ఈ తగ్గుదలకు కారణమని విశ్లేషకులు తెలిపారు. పేటీఎం, పైసా బజార్, సఫైర్ ఫుడ్స్ తదితర ఐపీవోలు ఇటీవల వచ్చాయి. తాత్కాలికంగా బ్యాంక్ల్లో డిపాజిట్లు తగ్గినా, గతేడాది నవంబర్ 19తో పోలిస్తే ఇవి 9.8 శాతం వృద్ధిచెందాయి.