న్యూఢిల్లీ, ఆగస్టు 27: నాణేల చెలామణిని పెంచేందుకు బ్యాంకులకు రిజర్వ్బ్యాంక్ ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచింది. సాధారణ ప్రజానీకానికి బ్యాగ్ నాణేల్ని పంపిణీచేస్తే బ్యాంకులకు 65 రూపాయిలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు శుక్రవారం ఆర్బీఐ తెలిపింది. ఇప్పటివరకూ ఈ ప్రోత్సాహకం రూ.25గా ఉంది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా నోట్ల మార్పిడి, నాణేల పంపిణీ ద్వారా బ్యాంకు శాఖలు ఖాతాదారుల సేవల్ని మెరుగుపర్చేందుకు పోత్సాహకాన్ని పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నాణేలు పంపిణీచేస్తే బ్యాగ్కు అదనంగా రూ.10 చెల్లించనున్నట్లు కేంద్ర బ్యాంక్ తెలిపింది. నాణేల్ని పంపిణీచేసినట్లు బ్యాంకుల ఇచ్చే ధృవీకరణతో సంబంధం లేకుండా కరెన్సీ చెస్ట్ల నుంచి బ్యాంకులు తీసుకునే నాణేల ఆధారంగా ప్రోత్సాహకాన్ని చెల్లించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది.