RBI | న్యూఢిల్లీ, జూలై 19: రిజర్వ్ బ్యాంక్ వచ్చే నెల జరిపే ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంచవచ్చని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా అన్నారు. బుధవారం ఇక్కడ సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖారా మాట్లాడుతూ.. రాబోయే ఆగస్టు సమావేశంలోనూ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
గడిచిన కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్నదని కాబట్టి ఈసారి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను యథాతథ స్థితిలోనే ఆర్బీఐ కొనసాగించవచ్చన్నారు.