ముంబై, జనవరి 1: డిపాజిట్లను క్లెయిం చేయని కస్టమర్లను అన్వేషించేందుకు ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్లు చేపట్టాలంటూ బ్యాంక్లను రిజర్వ్బ్యాంక్ ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ తాజాగా సమగ్ర మార్గదర్శకాలు జారీచేసింది. బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన క్లెయింకాని డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించడం, అవి చట్టబద్ధంగా చెందిన కస్టమర్లకు అప్పగించడం లక్ష్యంగా జారీఅయిన ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంక్లు నిర్వహణలో లేని ఖాతాలను, క్లెయింకాని డిపాజిట్లను వర్గీకరించడం, వీటికి ఒక నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉంటుంది. అటువంటి ఖాతాలు/డిపాజిట్లలో మోసాలు జరగకుండా బ్యాంక్లు వాటిని తరచూ సమీక్షించాలి.
ఈమెయిళ్లు, ఎస్ఎంఎస్లు పంపాలి
రెండేండ్లపాటు ఖాతాదారు జరిపిన లావాదేవీలేవీ లేకపోతే ఆ సేవింగ్స్/కరెంటు ఖాతాలను ఇన్ఆపరేటివ్గా పరిగణిస్తారు. పదేండ్లు, అంతకుమించి నిర్వహణలో లేని ఖాతాల్లో ఉన్న నగదు క్లెయింకాకుండా ఉంటే, దానిని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) ఫండ్ స్కీమ్కు బదిలీ చేస్తారు. తాజా మార్గదర్శకాలను అనుసరించి ఇన్ఆపరేటింగ్ ఖాతాలు/అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను చెందిన కస్టమర్లను అన్వేషించడంలో భాగంగా బ్యాంక్లు ఆయా ఖాతాదారును లేఖలు, ఈ మెయిళ్లు, ఎస్ఎంఎస్ల ద్వారా కాంట్రాక్టు చేయాల్సి ఉంటుంది. వీటిని ప్రతీ మూడు నెలలకోమారు పంపించాలి.
ఖాతాదారు ఎక్కడ ఉన్నడో కనుక్కోలేకపోతే..ఖాతాను ప్రారంభించే సమయంలో ఆ ఖాతాదారును బ్యాంక్కు పరిచయంవారిని బ్యాంక్ కాంట్రాక్టు చేయాలి. ఆ ఖాతాలో నామినీ రిజిష్టరై ఉంటే వారిని సైతం ఖాతాదారు ఆచూకీ కోసం బ్యాంక్లు కాంట్రాక్టు చేయాల్సి ఉంటుంది. నిర్వహణలో లేని ఖాతాలు/క్లెయింకాని డిపాజిట్లకు చెందిన కస్టమర్లు, వాటి నామినీలు, చట్టబద్ద వారసులు ఎక్కడ ఉన్నారో అన్వేషించడానికి బ్యాంక్లు తరచూ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలి.