Vinod Rai | యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్వతంత్ర చైర్మన్గా మాజీ కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) వినోద్ రాయ్ నియామకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. సెంట్రం గ్రూప్, భారత్ పే జాయింట్ వెంచర్తో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటైంది. వినోద్ రాయ్తోపాటు సిండికేట్ బ్యాంక్ మాజీ చైర్మన్ బసంత్ సేథ్, ఆర్బీఎల్ మాజీ చైర్మన్ సుభాష్ కుట్టేలను ఎస్ఎఫ్బీ డైరెక్టర్లుగా ఆర్బీఐ నియమించింది. సెంట్రం గ్రూప్, భారత్ పే సంయుక్త ఆధ్వర్యంలో సాగే డిజిటల్ బ్యాంక్లో లావాదేవీలు విజయవంతంగా సాగేందుకు బసంత్ సేథ్, సుభాష్ కుట్టే చేయూతనిస్తారు.
ఆర్బీఐ ఆమోదం లభించిన తర్వాతే గతేడాది నవంబర్లో యూనిటీ ఎస్ఎఫ్బీ కార్యకలాపాలు ప్రారంభించింది. సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంబీ)ని టేకోవర్ చేయడానికే సెంట్రం గ్రూప్-భారత్ పే జాయింట్ వెంచర్కు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ జారీ చేసింది. పీఎంబీని గట్టెక్కించడానికి ఆర్బీఐ ప్రతిపాదించిన పరిష్కార ప్రణాళికకు అనుగుణంగా యూనిటీ ఎస్ఎఫ్బీ చర్యలు ప్రారంభించింది.
బ్యాంక్స్ బోర్డు బ్యూరో చైర్మన్గా వినోద్ రాయ్ పని చేస్తున్నారు. మొండి బాకీల పరిష్కారానికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నతస్థాయి నియామకాలను బ్యాంక్స్ బోర్డు బ్యూరో చేపడుతుంది. ఐడీఎఫ్సీతోనూ వినోద్ రాయ్కు అనుబంధం ఉంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా రెండు దఫాలు పని చేశారు. .