న్యూఢిల్లీ, నవంబర్ 29: నెల రోజుల క్రితం హోల్సేల్ విభాగంలో ప్రయోగాత్మకంగా విడుదల చేసిన డిజిటల్ రుపీని రిజర్వ్బ్యాంక్ గురువారం రిటైల్ విభాగంలో తేనుం ది. ఈ పైలట్ ప్రాజెక్ట్లో ఎస్బీఐ, ఐడీఎఫ్సీ, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్లు పాల్గొంటాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అయిన రిటైల్ (e-R) నిర్వహణ పద్ధతిని మంగళవారం ఆర్బీఐ ప్రకటించింది. ఎంపిక చేసిన నగరాల్లో క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (సీయూజీ)లకు మాత్రమే డిజిటల్ కరెన్సీ అందుబాటులో ఉంటుంది. ఈ గ్రూప్లో బ్యాంక్ కస్టమర్లు, మర్చెంట్లుంటారు. ఆర్బీఐ లీగల్ టెండర్ కలిగిన e-R డిజిటల్ టోకన్ రూపంలో ఉంటుంది. కాగితపు కరెన్సీ, నాణేల తరహాలోనే వివిధ గుణిజాల్లో జారీచేస్తారు. రిటైల్ పైలట్ను తొలుత ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో అమలు చేస్తున్నారు. దశల వారీగా అమలయ్యే ఈ పైలట్ కోసం 8 బ్యాంక్ల్ని ఆర్బీఐ ఎంపిక చేసింది. తొలిదశలో ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ, యస్ బ్యాంక్లు e-R లను, వాలెట్లను పంపిణీ చేస్తాయి.
డిజిటల్ వాలెట్ ద్వారా లావాదేవీలు