Rajesh Warrier | న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ నంబియర్ తన పదవికి రాజీనామా చేశారు. నాస్కాం ప్రెసిడెంట్గా నియమితులు కావడంతో ఆయన కాగ్నిజెంట్కు రాజీనామా చేశారు. దీంతో కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్గా పదొన్నతి పొందిన రాజేశ్ వారియర్కు అదనంగా ఇండి యా సీఎండీగా బాధ్యతలు అప్పగించింది.
వచ్చే నెల 2న గ్లోబల్ హెడ్గా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న రాజే శ్..అక్టోబర్ 1 నుంచి సీఎండీగా వ్యవహరించనున్నారు. కాగ్నిజెంట్లో చేరకముందు రాజేశ్..ఈవీపీ, ఇన్ఫోసిస్లో విధులు నిర్వహించారు. అలాగే మైక్రోసాఫ్ట్ బిజినెస్ డిజిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు.