హైదరాబాద్, అక్టోబర్ 30: ప్రముఖ చిన్న పిల్లల దవాఖానల నిర్వహణ సంస్థ రెయిన్బో చిల్డ్రన్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ. 332.68 కోట్ల ఆదాయంపై రూ.63.16 కోట్లు పన్ను చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన ఆదాయం కంటే 6.3 శాతం వృద్ధిని కనబరుచగా, లాభంలో 2.7 శాతం పెరుగుదల కనిపించిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.