BCCI Ex President Srinivasan | బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ కంపెనీ `ఇండియా సిమెంట్స్’ ఆఫీసులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడి చేసింది. ఢిల్లీ, చెన్నైల్లోని ఇండియా సిమెంట్ కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం (ఫెమా) చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ ఈ సోదాలు జరుపుతున్నారు.
దేశంలోకి విదేశీ నిధుల రాక, నియంత్రణపై 1999లో ‘ఫెమా’ చట్టం అమల్లోకి వచ్చింది. అంతకుముందు చెన్నై, ఢిల్లీల్లోని కంపెనీ కార్యాలయాల్లో ఈడీ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. అయితే ఈడీ దర్యాప్తునకు సహకరిస్తామని ఇండియా సిమెంట్స్ యాజమాన్యం ప్రకటించింది. దేశంలోని పది అతిపెద్ద సిమెంట్ కంపెనీల్లో ఇండియా సిమెంట్స్ తొమ్మిదో సంస్థ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కంపెనీకి ఏడు ప్లాంట్లు ఉన్నాయి.