న్యూఢిల్లీ, జనవరి 13: దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) మూడో త్రైమాసికం (క్యూ3 లేదా అక్టోబర్-డిసెంబర్)లో 23 శాతం పెరిగాయి.
గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే వ్యవధిలో ఆయా సంస్థల నుంచి డీలర్లకు చేరిన మొత్తం ప్యాసింజర్ వాహనాలు 7,61,124 యూనిట్లుగా ఉంటే, ఈసారి 9,34,955 యూనిట్లుగా ఉన్నాయని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) శుక్రవారం తెలిపింది. ఒక్క డిసెంబర్లోనే ప్యాసింజర్ వాహన విక్రయాలు గతంతో చూస్తే 7 శాతం ఎగబాకి 2,19,421 యూనిట్ల నుంచి 2,35,309 యూనిట్లకు చేరుకున్నా యి.