న్యూఢిల్లీ, జూన్ 21: మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్-ఐనాక్స్ లీజర్ విలీనానికి లైన్ క్లియర్ అయింది. ఈ ఒప్పందానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఆమోదం తెలిపాయి. ఈ విలీనానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నుంచి నో అబ్జెక్షన్ లేటర్ లభించినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ఇతర రెగ్యులేటరీల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావాలంటే ఈ స్టాక్ మార్కెట్లు అనుమతి తప్పనిసరి.
మార్చిలో ఇరు సంస్థలు విలీనమవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో 1,500 స్క్రీన్లతో అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థగా అవతరించనున్నది. ప్రతి 10 ఐనాక్స్ షేర్లకుగాను మూడు పీవీఆర్ షేర్లు చొప్పున కొనుగోలు ఒప్పందం జరిగింది. విలీనం తర్వాత ఏర్పడనున్న సంస్థకు ఐనాక్స్ ప్రమోటర్లు..కో-ప్రమోటర్లుగా మారనున్నారు.