న్యూఢిల్లీ, ఆగస్టు 31: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ నూతన వడ్డీరేట్లు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ పేర్కొంది.
బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్కరోజు కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.10 శాతం నుంచి 8.15 శాతానికి చేరుకోగా..నెల రుణాలపై వడ్డీరేటు 8.20 శాతం నుంచి 8.25 శాతానికి, మూడు నెలల రుణాలపై వడ్డీరేటు 8.30 శాతం నుంచి 8.35 శాతానికి, ఆరు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై రేటు 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెరగనున్నాయి. అలాగే ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.60 శాతం నుంచి 8.65 శాతానికి చేరుకోగా, మూడేండ్ల వడ్డీరేటు 8.90 శాతం నుంచి 8.95 శాతానికి పెరగనున్నాయి.