న్యూఢిల్లీ, మే 27: పవర్ ట్రేడింగ్ సేవలు అందించే పీటీసీ ఇండియా లిమిటెడ్ లాభాలకు ఖర్చుల సెగ తగిలింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 17.67 శాతం తగ్గి రూ.129.34 కోట్లకు పరిమితమైంది.
అంతక్రితం ఏడాది రూ.157.11 కోట్ల లాభాన్ని గడించింది. కంపెనీ ఆదాయం రూ.3,107.04 కోట్ల నుంచి రూ.3,643. 02 కోట్లకు పెరిగినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.